Thursday, April 25, 2024

గ్రూపు రాజకీయాలను సహించేది లేదన్న జెడ్పీ చైర్ ప‌ర్స‌న్

ములుగు జిల్లా కేంద్రంలో ములుగు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ.. మండలాల్లో, గ్రామాల్లో మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు పాత్ర కీలకమ‌ని, పని చెయ్యని వారిని పదవిలో నుండి తొలగిస్తామ‌ని అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశాలు తప్పకుండా అవే వస్తాయని, పార్టీలో పదవులు రాలేదని, నేను వార్డు మెంబెర్ నుండి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులు వర్గాలు చేస్తూ, గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. పార్టీ సిద్దాంతాలు నచ్చకపోతే ఎవరైనా కూడా బయటకు వెళ్లి పోవచ్చునన్నారు. వరంగల్ లో నిర్వహించే విజయ గర్జన సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చి పార్టీ కార్యకర్తలను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, మండల అధ్యక్షులు లింగాల రమణ రెడ్డి, సునీల్ కుమార్, సురపనేని సాయి కుమార్, నూశెట్టి రమేష్, సుబ్బుల సమ్మయ్య, కుడుముల లక్ష్మీ నారాయణ, ఎంపీపీలు ములుగు గండ్ర కోట శ్రీదేవి సుదీర్ యాదవ్, బుర్ర రజిత సమ్మయ్య, సుడి శ్రీనివాస్ రెడ్డి, గొంది వాణి శ్రీ,శ్యామల శారదా, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్, తుమ్మ మల్ల రెడ్డి, ఎంపీటీసీ జిల్లా ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ కుమార్, మండలాల ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement