Thursday, April 25, 2024

పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలి: షర్మిల పిలుపు

తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న వైఎస్‌ షర్మిల.. పార్టీ సిద్దాంతాలు, ఎజెండాలపై దృష్టి పెట్టారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఒప్పుకునేలా తమ పార్టీ విధానాలు ఉండనున్నాయని షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల పార్టీ స్థాపించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయనున్న నేప‌థ్యంలో పార్టీ సిద్ధాంతాలు, జెండా, ఎజెండా వంటి అంశాల‌పై తుది నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా ష‌ర్మిల త‌న మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

 ‘ప్రజల ఆశయాలే… పార్టీ సిద్ధాంతాలు.. పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలి … ప్రతి బిడ్డ ఒప్పుకునేలా ఉండాలి.. సలహాలు, సూచనలు కొరకు వాట్స‌ప్ నంబ‌రు 8374167039కు పంపండి లేదా [email protected]కు ట్వీట్ చేయండి’ అని ఆమె ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. పార్టీలో కార్యకర్తలే కీలకం అని వారికే పెద్ద పీటవేస్తాం అని తెలిపారు. పార్టీని కార్యకర్తలే ముందుండి నడిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement