Wednesday, March 27, 2024

40 ఇయర్స్ ఇండస్ట్రీ.. రాజకీయ ముగింపు ఇలా..

టీడీపీ భవిష్యత్తును చంద్రబాబు అనుకూల మీడియాకు అప్పగించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే జీపీఏ రాసిచ్చారని పేర్కొన్నారు. అనుకూల మీడియా రాసే కథలకు మురిసిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా సాగుతోందని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘’సిగ్గూశరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చావేదికలు పెడుతున్నారు. విశాఖ పాలనా రాజధానవుతుందంటే ఓర్వలేరు. పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేరు. పైగా ముఖ్య అతిథులుగా అశోక్, అచ్చెన్న. విజయనగరం, శ్రీకాకుళంను రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా మార్చిన ఘనులు వీరు.’’ అంటూ విమర్శించారు.

సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 20% తగ్గాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక వెల్లడించిందని విజయసాయి తెలిపారు. బాబు హయాంలోకంటే ఇప్పటి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం, 96% కేసుల్లో దోషులను గుర్తించడం, బాధితులకు పరిహారం పెంచడాన్ని బ్యూరో గుర్తించిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: టీడీపీ నేత కూన రవిపై ప్రివిలేజ్‌ కమిటీ సీరియస్

Advertisement

తాజా వార్తలు

Advertisement