Thursday, April 18, 2024

ఎంత మంది చనిపోతే ఉద్యోగాలు ఇస్తారు: ష‌ర్మిల మండిపాటు

తెలంగాణ సీఎం కేసీఆర్ రోజుకో నిరుద్యోగి హత్యతో రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల. ఉద్యోగం రావ‌ట్లేద‌ని తీవ్ర నిరాశ‌కు గురైన మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం లింగాపూర్ గ్రామానికి చెందిన భూక్య నరేశ్ (26) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వ‌చ్చిన వార్త‌ను ఆమె పోస్ట్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 26 ఏళ్ల‌ నరేశ్‌ ను హత్య చేసిన రాతిగుండె కేసీఆర్ ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? ఇప్పటికే వంద‌ల‌ మంది నిరుద్యోగులు చనిపోయారు’ అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్’ అని ష‌ర్మిల పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల‌ కోత పెడుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యం స‌రిగ్గా అంద‌ట్లేద‌ని కేసీఆర్ పై ష‌ర్మిల విమ‌ర్శించారు. ‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పెనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను .. సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్.. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పుడు.. ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు.. పరిపాలన చేయడం చేతకానప్పుడు .. మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని ఆమె విమ‌ర్శించారు.

ఇది కూడా చదవండి: బోగస్ చలానాల స్కాంలో బయటపడుతున్న నిజాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement