Wednesday, April 24, 2024

జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం

తెలంగాణలో రాజ‌న్న రాజ్యమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటున్నారు. ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ పేరుతో షర్మిల పార్టీని స్థాపించబోతున్నారు. ఇప్పటికే ఈ పేరులో కేంద్ర ఎన్నికల సంఘానికి రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఈ ప్ర‌క్రియ నేటితో ముగిసిన‌ట్లు అధికారికంగా ప్ర‌కట‌‌న వ‌చ్చింది.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని ఆ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త రాజ‌గోపాల్ చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. వైఎస్సార్  సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకు వస్తామ‌ని తెలిపారు.

వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారికంగా దీనిపై సంబంధిత ప‌త్రాలు త‌మ‌కు అందాక పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామ‌ని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి అన్ని రకాల ఏర్పాట్లను సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే తాము ప్రారంభించిన‌ట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసు.. విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ

Advertisement

తాజా వార్తలు

Advertisement