Wednesday, April 24, 2024

నా కన్నీరు ఆగనంటుంది: షర్మిల ఎమోషనల్

దివంగత సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ట్వీట్ పై సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాను ఒంటరి అంటూ ఆమె ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు. అయితే, తాను ఒంటరిగా ఫీలవుతున్నాననే విషయాన్ని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పకనే చెప్పారు. ఆమె ట్వీట్ పై సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏపీ సీఎం జగన్ – షర్మిల మధ్య ఉన్న గ్యాప్ ఆమె ట్వీట్ తో మరోసారి రుజువు అయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత కొంత కాలంగా అన్న చెల్లి అయిన జగన్, షర్మిల మధ్య గ్యాప్ ఉంది. ఇద్దరూ కలిసి ఈ గ్యాప్ లో ఎక్కడా ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో గురువారం వైఎస్ వర్ధంతి సందర్భంగా అయినా ఇద్దరూ కలిసి తండ్రికి నివాళి అర్పిస్తారా లేదా అనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే, సీఎం జగన్, షర్మిల, విజయమ్మ, భారతి సహా కుటుంబ సభ్యులంతా ఒకే సారి వైఎస్సార్ ఘాట్ కు వచ్చారు. అందరు కలిసి నివాళి అర్పించి.. అక్కడ జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కానీ, జగన్ – షర్మిల ఒకరిని ఒకరు పలకరించుకున్న సందర్భం అయితే కనిపించ లేదు. దీంతో షర్మిల తాజా ట్వీట్ కి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇది కూడా చదవండి: విజయమ్మ ఆత్మీయ సభపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement