Thursday, April 25, 2024

పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి… కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి రూరల్ : వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామగుండం ఎమ్మేల్యే కోరుకంటి చందర్ ఆద్వర్యంలో జిల్లా బీ ఆర్ ఎస్ కార్యాలయంలో రామగుండం నియోజక వర్గ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇంచార్జులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. లక్ష్య సాధనలో నిరంతరం పార్టీ కోసం శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement