Thursday, April 25, 2024

ఆమె భ‌ద్ర‌త‌కు భ‌రోసా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మహిళల భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సురక్షితమని డీజీపీ అంజనీ కుమార్‌ అన్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రతా విభాగం కార్యకలాపాలపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీకు మార్‌ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకై తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని పేర్కొంటూ ఈ విషయంలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్న మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్‌, డీఐజీ సుమతిని డీజీపీ ప్రశంసించారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి పోలీస్‌ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 750 పోలీస్‌స్టేషన్లలో మహిళా డెస్క్‌లు (డబ్ల్యుహెచ్‌డీ) పని చేస్తున్నాయని, మిగిలిన పోలీస్‌ స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు.

మహిళల భద్రతపై ఇప్పటికే సంస్థాగతంగా ఉన్న మెకానిజంలను ఒకే సాంకేతిక ప్లాట్‌ఫాం కిందికి తీసుకురావడం ద్వారా మరింత సమర్థంగా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని చెప్పారు. మహిళల భద్రతా విభాగానికి అందే ఫిర్యాదుల పరిష్కారంపై పిటిషనర్ల స్పందనను తెలుసుకునేందుకు స్వతంత్రంగా పని చేసే 24గంటల కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం 12 యూనిట్లలో భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తెస్తామన్నారు. 25 ట్రై కమీషనరేట్‌ పరిధుల్లో గృహహింస బాధితులకు కౌన్సెలిం గ్‌ సేవలను చేపట్టేందుకు సాధికారత కేంద్రం (సీడబ్ల్యుఇ డబ్ల్యు) త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భరోసా కేంద్రాల ద్వారా లైంగిక నేరాల కేసుల విచారణను పర్యవేక్షించడం వల్ల 2022లో 23 కేసుల్లో నేరారోపణలు నిర్ధారించడం జరిగిందన్నారు. ఇంకా క్రమపద్దతిలో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 30 యూనిట్లలో పనిచేసే యాంటీ హ్యూమన్‌ ట్రాఫిికింగ్‌ యూనిట్లను హాట్‌ స్పాట్లను గుర్తించడం, తిరిగి నేరాలకు పాల్పడే నేరస్తుల డేటా బేస్‌ను ప్రత్యేకంగా రూపొందిం చాలని డీజీపీ ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో ఈవ్‌ టీజింగ్‌తో పాటు వివిధ రకాల నేరాలను అరికట్టడంలో షీటీంలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అభినందించారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. 2022లో షీ టీంలకు 6157 ఫిర్యాదులు రాగా, వాటిలో 521 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగిందని, 13,471 అవగాహన శిబిరాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేరాల నివారణపై సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement