Thursday, March 28, 2024

రేవంత్ అంటే కేసీఆర్ కు భయం.. మహిళా కాంగ్రెస్ సత్యాగ్రహం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రభుత్వానికి భయం అని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అన్నారు. కోకాపేట భూములు అమ్మకంలో అవినీతి జరిగిందంటూ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరును ఖండిస్తూ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బేన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సునీతారావ్ ఆధ్వర్యంలో మహిళలు శాంతియుతంగా సత్యాగ్రహం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని చూస్తే ప్రభుత్వం, కేసీఆర్ భయపడుతున్నారని సునీతా రావు విమర్శించారు. కోకాపేట భూముల్లో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడతారని, తమ బాగోతం బయటపడుతుందని కేసీఆర్ భయపడే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. సీఎం కేసీఆర్ కు ఏజెంట్ గా మారిపోయారని సునీతా రావు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement