Thursday, April 18, 2024

కార్పొరేటర్ భ‌ర్తను చెప్పుతో కొట్టిన మహిళ

నిజామాబాద్ లో బీజేపీ కార్పొరేట‌ర్‌ భ‌ర్తను ఓ మ‌హిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేశాడ‌ని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది. తన కూతురిని మోసం చేశాడంటూ ఇంటిముందు బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. కార్పొరేటర్ భర్త ఆకుల శీను తన కూతురిని మోసం చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆకుల శీను ఇంటికి వెళ్లి ఆయ‌న‌పై దాడి చేశారు. త‌మ కూతురిని అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో త్వరలో 1,654 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement