Saturday, April 20, 2024

రాష్ట్రంలోని అర్బన్‌ పార్కుల్లో వన్యప్రాణుల గణన

ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్రంలోని పలు అర్బన్‌ పార్కుల్లో ఉన్న వన్య ప్రాణుల గణనను రాష్ట్ర అటవీశాఖ ప్రారంభించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కులో ఉన్న నెమళ్ళ సంఖ్యను లెక్కించారు. అటవీశాఖ సిసిఎఫ్‌ మార్గదర్శకంలో ఫ్రైండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ, ఎన్జీవోస్‌ ఆఫ్‌ డెక్కన్‌ బోర్డర్స్‌, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి అటవీ శాఖ అధికారులు నెమళ్ళ కదలికలను అంచనా వేసి మొత్తం 512 ఉన్నట్లుగా తేల్చారు.

నెమళ్ళ గణననలో స్వచ్ఛంద సంస్థలకు చెందిన 35 మంది సభ్యులతో పాటు అటవీ శాఖ రిటైర్డు డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు శంకరన్‌, అటవీశాఖ అధికారులు ఎం. జె. అక్బర్‌, జోగి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement