Thursday, April 18, 2024

భర్త చేతిలో భార్య దారుణ హత్య

భ‌ర్త చేతిలో భార్య దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట రేణుక (35) తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. శనివారం మధ్యాహ్నం పెద్దల సమక్షంలో కుటుంబ సమస్యల గురించి పంచాయతీ నిర్వహించగా తాను భర్తతో ఉండనంటూ వెళ్ళిపోతుండగా.. భర్త భార్య‌ను వెంబడించి బండరాయితో తలపై మోది నడివీధిలో దారుణ హత్య చేశాడు. మంథని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement