Friday, March 29, 2024

దివ్యాంగుల వీల్‌చైర్ ప్రీమియ‌ర్ లీగ్.. విజేత‌ల‌కు బ‌హుమ‌తుల అంద‌జేత‌

హైద‌రాబాద్‌లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో జ‌రిగిన దివ్యాంగుల వీల్ చైర్ ప్రీమియ‌ర్ లీగ్ ఆట‌ల పోటీలు ముగిశాయి. ముగింపు కార్య‌క్ర‌మానికి మంత్రి వి. శ్రీ‌నివాస్‌గౌడ్ హాజ‌ర‌య్యి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంతరం క్రీడా స్టేడియంలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల శిక్షణ తరగతులను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మార్షల్ ఆర్ట్స్‌లో మేలుకువలు నేర్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, నిర్వాహకులు శ్రీధర్, కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement