Thursday, April 25, 2024

ఎవరికీ ఇబ్బంది కలగనీయం.. సినిమా టికెట్టు రేట్లపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం..

ప్ర‌భ‌న్యూస్ : సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. టిక్కెట్‌ ధరలపై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సమస్యను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో పలువురు సినీ ప్రముఖులతో మంత్రి తలసాని సమావేశమయ్యారు.

నిర్మాతలు దిల్‌రాజు, సూర్యదేవర రాధాకృష్ణ, సునీల్‌ నారంగ్‌, డివివి దానయ్య, రాధాకృష్ణ, దర్శకులు రాజమౌలి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి పాల్గొన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సినీ ఇండస్ట్రీ రెండేళ్ళుగా కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటున్నామని, సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement