Tuesday, April 23, 2024

అవ‌కాశ‌మిస్తే… ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేస్తాం : బండి సంజ‌య్

బీజేపీకి అవకాశమిస్తే..ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. జైలుకెళ్తామన్న భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మొదలుపెడతామని స్పష్టం చేశారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించకుండా.. ఫత్వా జారీచేసే పరిస్థితికి ఎంఐఎం వచ్చిందని బండి సంజయ్‌ విమర్శించారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. యూనిఫాంతో మాత్రమే స్కూళ్లకు రావాలనడంలో తప్పేంటని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement