Thursday, April 18, 2024

పెండింగ్ ప‌నుల‌ను త్వ‌ర‌లో పూర్తి చేస్తాం : నీలా గోపాల్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని ఈరోజు మర్యాద పూర్వకంగా కలిసి 20వ డివిజన్ లో పెండింగ్ లో వున్న మేడికుంట చెరువు వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, జయ దీపిక ఎస్టేట్ స్టోమ్ వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్యాచ్ వర్క్, సీసీ రోడ్లను అతి త్వరలో శాశ్వత పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసంద‌ర్భంగా మేయర్ మాట్లాడుతూ… అతి త్వరలో కంప్లీట్ చేస్తామ‌ని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ వీరేంద్ర రెడ్డి, తెరాస నాయకులు ఆవుల జగన్ యాదవ్, వెంగాయ్యా చౌదరి, SC సెల్ ప్రధాన కార్యదర్శి నీరుడు యాదగిరి, పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement