Thursday, April 25, 2024

రూ.7500కోట్ల‌తో 26వేల స్కూళ్లు అభివృద్ధి చేశాం… స‌బితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో మన ఊరు – మన బడి ద్వారా 26వేల స్కూళ్లను 7500 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని రాష్ట్ర మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం తోల్ కట్టలో కొత్తగా నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ సెటిలర్స్ వారు సంపాదించిన దాంట్లో కొంత మేర తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధి కోసం సహకారం అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement