Wednesday, April 24, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి…

భూపాలపల్లి క్రైమ్(ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ శివారు ఇటుక బట్టీల వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే గణపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన జాలిగాపు శ్రీకాంత్ (20) పని నిమిత్తం పల్సర్ ద్విచక్ర వాహనం పై చెల్పూర్ కు వెళ్లి తిరిగి స్వగ్రామంకు వస్తుండగా చెల్పూర్ శివారు గొల్లపల్లి క్రాస్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఏదైనా వాహనం ఢీ కొట్టిందా..? లేక ద్వి చక్ర వాహనం అదుపుతప్పడంతో నే ప్రమాదం చోటుచేసుకుందా అనేది తెలియాల్సిఉంది. మృతుడు శ్రీకాంత్ బి టెక్ చదువుతున్నాడు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement