Saturday, April 20, 2024

అగ్నిపథ్‌ని ప్రశ్నిస్నే చంపేస్త‌రా? రాకేశ్ మృతికి నిర‌స‌న‌గా రేపు న‌ర్సంపేట బంద్‌

కేంద్రం తీసుకురానున్న అగ్నిప‌థ్ గురించి ప్ర‌శ్నిస్తే చంపేస్త‌రా? వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌కు చెందిన రాకేశ్ మృతికి నిర‌స‌న‌గా రేపు న‌ర్సంపేట బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్టు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి తెలిపారు. కేంద్రం అగ్నిపద్ ప‌థ‌కానికి నిరసనగా రేపు జరిగే నియోజకవర్గ బంద్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నియోజకవర్గంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ ఈ బంద్ కు సహకరించాలన్నారు.

ఆర్మీలో తీసుకువ‌స్తున్న కొత్త ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌శ్నించినందుకు దబ్బీర్ పేట గ్రామ రైతు సమితి కోఆర్డినేటర్ కుమారస్వామి కుమారుడు రాకేశ్ చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. బీజేపీ పతనం దగ్గర ప‌డింద‌ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రాకేశ్ మృతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement