Thursday, April 25, 2024

బంజారాల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఆద్వర్యంలో బంజారా ఆరాద్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల యాకుబ్ పూర వరంగల్ లో నిర్వహించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజర‌య్యారు. బంజారా ఆరాధ్య దైవమైన సద్గురు సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ ఆథ్యాద్మీకవేత్త, సంఘ సేవకులు సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అహింస మార్గాన్ని ఎంచుకొని జీవహింస చేయకూడదని మంచిమార్గంలో నడవాలని సేవలాల్ మహరాజ్ బోధించారన్నారు. విద్యార్థులందరు సేవాలాల్ మహరాజ్ నేర్పిన బాటలో నడవాలని మంచిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ గురుకుల పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని మరిన్ని నిధులు కేటాయించి గొప్పగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బంజారాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సీఎం కేసీఆర్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలని అధికారికంగా నిర్వహించడం గర్వకారణం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement