Saturday, April 20, 2024

స్కై విజన్ కార్యాలయంపై దాడి : రూ.70వేలు, ఎల్ఎన్టీల అపహరణ

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం తాళ్లగడ్డ వై జంక్షన్ స్కై విజన్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి 88ఎల్ఎన్టీ లు, రూ.70వేల నగదు అపహరించారు. స్కై విజన్ ఇంచార్జి రామ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 8గంటల సమయంలోగుర్తు తెలియని 8మంది వ్యక్తులు స్కై విజన్ కార్యాలయంపై దాడి చేసి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ కు సంబంధించిన మాక్స్ వైర్లు, డిష్ సిగ్నల్ వైర్లను ధ్వంసం చేశారన్నారు. దీంతో రూ.2లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై రమేష్ పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement