Friday, April 19, 2024

వరంగల్ లో అల్టిగ్రీన్‌ నూతన రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభం

భారతదేశంలో సుప్రసిద్ధ వాణిజ్య విద్యుత్‌ వాహన తయారీదారు అల్టిగ్రీన్‌ నేడు తమ బ్రాండ్‌ నూతన రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని తెలంగాణాలోని వరంగల్‌లో ప్రారంభించింది. ఇది భారతదేశంలో కంపెనీకి 24వ డీలర్‌షిప్‌. గతంలో ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధానమైన మెట్రో నగరాలలో తమ డీలర్‌షిప్‌లను విజయవంతంగా ప్రారంభించింది.ఈ సందర్భంగా అల్టిగ్రీన్‌ ఫౌండర్‌, సీఈఓ డాక్టర్‌ అమితాబ్‌ శరణ్‌ మాట్లాడుతూ… తెలంగాణాలో రామ్‌ ఎలక్ట్రిక్‌తో తమ భాగస్వామ్యం మరింత ధృడంగా చేసుకునే అవకాశం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఆటోమొబైల్‌ వ్యాపారంలో రామ్‌ ఎలక్ట్రిక్‌కు దశాబ్దాల అనుభవం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఈవీ విస్తరణను మరింత వేగవంతం చేయడంలో ఇది తోడ్పడుతుందన్నారు.

రామ్‌ ఎలక్ట్రిక్‌ యజమాని అమిత్‌ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్‌ వాహన పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయాలనే ప్రభుత్వ కార్యక్రమాలకు తోడ్పాటునందించడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఈవీ, ఇంధననిల్వ విధానం రాష్ట్రంలో ఈవీ కంపెనీల కోసం స్నేహపూర్వక వాతావరణం సృష్టించనుందన్నారు. అల్టిగ్రీన్‌తో వరంగల్‌లో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నామన్నారు. కార్బన్‌ రహిత రవాణాను వేగవంతం చేయాలనే లక్ష్యంకు మద్దతు అందించనున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement