Friday, April 26, 2024

ద్విచక్ర వాహనం, ఇసుక లారీ ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు

తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలోని కాటాపూర్ అటవీ శాఖ అతిథిగృహంల స‌మీపంలోని మూలమలుపు వద్ద ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పడిగాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కాయం ఎలయ్య, యాప నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తూ మూలమలుపు చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయాలపాలైన వారిని స్థానికులు 108 సహాయంతో ములుగు ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement