Friday, March 29, 2024

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ… తృటిలో తప్పిన పెను ప్రమాదం

రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీకొన్న ఘ‌ట‌న జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన‌డంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగ‌తా ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు సేక‌రించారు. అనంత‌రం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రాయాణికులను ఇతర వాహానాల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement