Friday, April 26, 2024

రెండు కార్లు, బైక్ ఢీ : ఒక‌రు మృతి, ఐదుగురికి తీవ్ర‌గాయాలు

రెండు కార్లు, ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ కారు ఎటునాగారం నుంచి హనుమకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీకొనడంతో పాటు అటు వైపే వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టాయి. ఈ క్రమంలో కార్ల వెనుక వైపు నుంచి వస్తున్న మరో కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement