Tuesday, April 23, 2024

రెండు బైకులు ఢీకొని, ఇద్దరు మృతి.. హ‌న్మ‌కొండ జిల్లాలో ఘ‌ట‌న‌

భీమదేవరపల్లి, (ప్రభ న్యూస్): హన్మకొండ జిల్లాలో రెండు బైకులు ఢీకొన్న ఘ‌ట‌న జ‌రిగింది. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి స్టేజి వద్ద ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన‌డంతో అక్కడికక్కడే ఇద్ద‌రు చ‌నిపోయారు. సమాచారం అందుకున్న ముల్కనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప‌రిశీలించారు. కాగా, మృతుల్లో ఒకరు కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి లింగారెడ్డి, ఇంకొకరు హన్మకొండకు చెందిన లవకుమార్ గా గుర్తించారు. ముల్కనూరు ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement