Saturday, April 20, 2024

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా టీఆర్ఎస్ ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు పార్టీ అందజేసింద‌న్నారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి టీఆర్ఎస్ పార్టీ భీమా వర్తింపచేస్తుందని, ఈ క్రమంలోనే పరకాల నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన ఆరుగురు పార్టీ కార్యకర్తలకు రూ.2లక్షల చొప్పున హన్మకొండలోని వారి నివాసంలో చెక్కులను అందజేశామ‌న్నారు. పరకాల మండలం లక్ష్మీపురంకు చెందిన గురిజపల్లి సత్యం, సీతారాంపురంకు చెందిన వెల్దండి స్రవంతి, నడికూడ మండలం సర్వాపూర్ కు చెందిన మీణుగు రాజు, రామకృష్ణాపూర్ కు చెందిన యార రాజమల్లు, సంగెం మండలం కాట్రపల్లికి చెందిన వల్లెపు సంపత్, దామెర మండలం తక్కళ్ళపాడ్ కు చెందిన పల్లకొండ సారంగం కుటుంబాలకు ఈ చెక్కులు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మాజీ KUDA డైరెక్టర్ ఎన్కతాళ్ల రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ, జిల్లా సర్పంచులు ఫోరమ్ అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి, నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, దామెర మండల అధ్యక్షుడు గుండు రాము, ఎంపిపి కాగితాల శంకర్, జెడ్పిటిసి గరిగే కల్పన కృష్ణమూర్తి, తెరాస నాయకులు వున్నం సంపత్, దాడి మల్లయ్య, దాడి రమేష్, ముష్కే రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement