Saturday, April 20, 2024

వరంగల్ లో ఐదుగురు ఎస్సైల బదిలీ

వరంగల్ క్రైమ్ మే 8 (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదుగురు ఎస్సైలను బదిలీలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మట్వాడా ఎస్సై బి.శంకర్ నాయక్ ను జఫర్ గడ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. జఫర్ ఘడ్ ఎస్సై బి.మాధవ్ ను వరంగల్ వేకన్సీ రిజర్వులో పెట్టారు. ఎస్సై సి.హెచ్ రఘుపతిని జనగాం నుండి రఘునాథ్ పల్లికి, ఎస్సై షేక్ జానీ పాషాను నర్మెట్ట నుండి నెక్కొండ ఎస్సైగా నియమించారు. ఇక నెక్కొండ ఎస్సై సీమాపర్హిన్ ను వి.ఆర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement