Friday, March 29, 2024

ట్రాక్ దాటుతుంటే ట్రైన్ ఢీకొట్టింది.. తుక్కు తుక్కైన బైక్..

కేసముద్రం, (ప్రభాన్యూస్ ): ట్రాక్ దాటిస్తుండ‌గా ఓ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢికొన్న సంఘటనలో బైక్ తునాతునకలు కాగా ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారంతో…గంటపాటు కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కేసముద్రం మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింద నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు వ‌స్తున్న స‌మ‌యంలో బైక్ దాటిస్తు్ంగా ఆ బైక్ తునా తునుకలు అయింది, బైక్ ను దాటిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. ఈసంఘటన నేపథ్యంలో సంపర్క్ ఎక్స్ ప్రెస్ రైలు కేసముద్రం రైల్వే స్టేషన్ లో గంటపాటు నిలిచిపోయినట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement