Friday, March 29, 2024

మొరంచపల్లిలో విషాదం.. వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి మండల పరిధిలోని మొరచపల్లి గ్రామంలో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరంచపల్లి గ్రామానికి చెందిన చుక్క సారయ్య (60) ఆయన భార్య కవిత ఇంటిలో శ‌వమై కనిపించారు. కాగా ఈ వృద్ధ దంపతుల మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మృతి చెందిన సారయ్య మృతదేహం ఉండగానే సారయ్య భార్య కవిత ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు కుమార్తె సంతానం. తనకున్న వ్యవసాయ భూమి గురించి కుటుంబ తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి పై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement