Friday, April 19, 2024

కెనాల్ లో ట్రాక్టర్ బోల్తా : ఒకరు మృతి

చిట్యాల : వ‌రంగ‌ల్ జిల్లాలోని చిట్యాల‌ మండలం తిరుమలపూర్, జూకల్ గ్రామాల మధ్య కెనాల్ లో ఈరోజు ట్రాక్టర్ బోల్తా పడ‌డంతో మహారాష్ట్రకు చెందిన కర్ర సప్లై లేబర్ మహేష్ ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. గుంటూరు పల్లి నుండి సుబాబుల్ ట్రాక్టర్ ద్వారా గ్రామ శివారు వరకు ట్రాక్టర్ లో తీసుకువచ్చి లారీలో లోడ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు కెనాల్ లో ట్రాక్టర్ బోల్తా ఒకరి మృతి చెందారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement