Thursday, March 28, 2024

Breaking: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు… చిన్నారి ప‌రిస్థితి విష‌మం..

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకుల తండాలో విషాదం చోటు చేసుకుంది. మల్లంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొన్న ఘటనలో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆకులతండా గ్రామానికి చెందిన దరావత్ పాచ్య, భార్య నాగమ్మ, మనుమరాలు మూడేళ్ల పూర్ణిమగా గుర్తించారు. ఇటుకాలపల్లి గ్రామ సెంటర్‌లో మల్లంపల్లి నుండి నర్సంపేట వైపుగా వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మూడేళ్ల చిన్నారి సహా మిగతా ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వీరిని హుటాహుటిన నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement