Thursday, April 25, 2024

కోనాపురంలో దొంగల బీభత్సం.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్తుల కథనం ప్రకారం మండల సుధాకర్ కు చెందిన ఇంట్లో దొంగతనం చేసి 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సుధాకర్ కుమారుడు నాగరాజుకు ఇటీవలే వివాహం జరగడంతో మొక్కుల కోసం ఇంటిల్లిపాది వేములవాడకు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లారు. కాగా ఆదివారం అర్ధరాత్రి సమయాన సుధాకర్ ఇల్లు వెనుకవైపు భాగం ఉన్న తలుపును గడ్డపార సహాయంతో తొలగించి బీరువాలో ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం సుధాకర్ అమ్మ ఇల్లు శుభ్రం చేయడానికి వస్తే అక్కడ చిందరవందరగా పడి ఉన్న వస్తువులను చూసి షాక్ కు గురై చుట్టుపక్కల వారికి తెలియజేసింది. పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో నర్సంపేట ఏసీపీ సంపత్ రావు, నెక్కొండ సి.ఐ.హతీరాం, చెన్నారావుపేట ఎస్ఐతోట మహేందర్ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామస్థుల నుండి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బంది సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement