Friday, April 19, 2024

విద్యుత్ వైర్లు తగిలి యువకుడికి తీవ్రగాయాలు


జనగామ క్రైమ్: జనగామ జిల్లా కేంద్రంలోని రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ లో పనిచేసే ఓ యువకుడికి ప్రమాదవశాత్తు విద్యుత్ మేన్ వైర్లు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం బిర్యాని సెంటర్ లో పనిచేస్తున్నఒరిస్సా రాష్ట్రానికి చెందిన సాదిక్ అనే యువకుడు బిర్యాని సెంటర్ పై వున్నఅంతస్తు బాల్కానీ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యుత్ మంటలు చెలరేగి ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కొంతమంది ముందుకు వచ్చి యువకుడిని క్రిందికి తీసుకువచ్చి 108కు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని హుటాహుటిన జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేసి వరంగల్ ఎం జి ఎం కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement