Monday, March 25, 2024

కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య

వాజేడు : రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. కలిసి బతుకుతానని భర్త వేలు పట్టుకొని ఏడడుగులు వేసిన భార్య మానవత్వం మరిచి ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాడిని కడతేర్చిన సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామంలో చోటుచేసుకుంది. పేరూరు ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన గుడ్డే బసవయ్య @ బాబు (47 సం.) కోయ అనే అతడి భార్య అయిన గొడ్డే సుజాత అదే గ్రామానికి చెందిన పెండకట్ల దర్శన్ బాబుతో గత కొంత కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయమై గతంలో పంచాయతీ జరిగినా కూడా వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, ఈ క్రమంలో గత రాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి సమయంలో దర్శన్ బాబు సుజాతలు రచించుకున్న పథకం ప్రకారం సుజాత భర్త బసవయ్య @ బాబు వారిద్దరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతడిని ఇద్దరు కలిసి గొంతు నులిమి చంపేశారని గోట లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేరూరు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంకటాపురం సర్కిల్ శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement