Tuesday, March 26, 2024

పూజారిని.. రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ప్రాంతంలో గోవిందరాజుల పూజారి దెబ్బ కట్ల రవి హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం కొండాయి గ్రామానికి చెందిన దెబ్బ కథ రవి గోవిందరాజుల గుడి వద్ద పూజారిగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గోవిందరాజులు పూజారి కట్ల రవి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కొండాయి గ్రామనికి చెందిన ధబగట్ల (45) ను బాండ రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపి ఆగతంకులు. కుటుంబ తగాదాలు,వ్యక్తిగత కక్షలు, మరేతర కారణాల వల్ల ఈ ఘాతుకానికి ఓడగట్టారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతర విషయంలో ఏమైనా సంబంధం ఉండి, ఉంటుందా అనే కోణంలోను విచారణ చేపదుతున్నారు .దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement