Friday, April 19, 2024

కేజీబీవీ టీచర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు.. అర్ధరాత్రి బయటికి పోవడమే కారణమా?

జనగామ, (ప్రభన్యూస్ ప్రతినిధి) : కేజీబీవీ టీచర్​పై జనగామ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు అందింది. అర్ధరాత్రి వేళ డ్యూట చేయకుండా బయటకు వెళ్తున్నారని, దీంతో పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని విద్యార్థినుల తల్లిదండ్రుల కంప్లెయింట్​ మేరకు గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్​కు రాతపూర్వకంగా ఈ ఫిర్యాదు అందింది. కాగా, దీనిపై విద్యార్థి సంఘాలు ఇవ్వాల పాఠ‌శాల‌ను సందర్శించి ధర్నా చేయడంతో ఈ విష‌యం కాస్త బయటికి వచ్చింది.

కాగా, ఆ ఫిర్యాదులో కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పిల్లలతో పనులు చేయించుకోవడమే కాకుండా నైట్ డ్యూటీ సమయంలో బయట తిరుగుతోంద‌ని.. ఈ విషయాన్ని తమ పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది. టీచర్ మూలంగా విద్యార్థుల భవిష్యత్తు పెడదారి పట్టే అవకాశం ఉందన్న కార‌ణంగా టీచ‌ర్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement