Wednesday, April 24, 2024

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ : గండ్ర జ్యోతి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ వీణవర వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు టీఆర్ఎస్, రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రమణారెడ్డి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి , మహిళా ప్రజాప్రతినిధులు ,కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement