Wednesday, April 24, 2024

తెలంగాణలో మరోసారి టెన్త్ పేపర్ లీకేజీ కలకలం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న టెన్త్ ప‌రీక్షా ప‌త్రం లీకైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే మరోసారి టెన్త్ పేపర్ లీకేజీ కలకలం రేపింది. వరంగల్‌లో హిందీ పరీక్షా పత్రం లీక్ అయింది. ఉదయం 9.30గంటలకే ప్రశ్నాపత్రం బయటికొచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొడుతోంది. వరుసగా రెండో రోజు టెన్త్ పరీక్షా పత్రాలు లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా.. నిన్న వాట్సప్ గ్రూప్ లో టెన్త్ ప్రశ్నాపత్రం సర్క్యులేట్ అయిన ఘటనలో తాండూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసులో ఇఫ్పటికే నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. వరుసగా రెండోరోజు పేపర్ లీక్ కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement