Thursday, April 25, 2024

పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి – రోడ్డెక్కిన రైతులు

రేగొండ : గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ధ‌ర్నా, రాస్తారోకో చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారి రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామ స్టేజి వద్ద చెన్నపూర్, రూపిరెడ్డి పల్లి గ్రామ రైతులు ధర్నా, రాస్తా రోకో చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ధర్నా స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement