Saturday, April 13, 2024

ఘనంగా రాములోరి కళ్యాణం.. ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ వేడుకతో ప్రగతి సింగారం గ్రామం పులకరించిపోయింది. జయజయ ద్వనాల మధ్య జగదబిరాముడి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… శ్రీ రామనవమి – సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు, గ్రామ‌స్తులకు ఎమ్మెల్యే శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్యర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement