Friday, April 26, 2024

BREAKING: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఫ్లెక్సీలు దగ్ధం చేసిన తెరాసా నాయకులు..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఫ్లెక్సీలు తెరాసా నాయకులు దగ్ధం చేశారు. గోబ్యాక్ షర్మిల అని నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఎంపిపి విజేందర్, సర్పంచ్ కుమార స్వామి, నాయకులు చెన్నారెడ్డి ఉన్నారు.

షర్మిల బస చేసే బస్సు దగ్ధం చేసే యత్నం..
వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షర్మిల బస చేసే ఏసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించి బస్సులో ఉన్న సిబ్బంది మంటలను గమనించి ఆర్పి వేశారు. షర్మిల పాదయాత్రలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు దుండగులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement