Saturday, April 20, 2024

సికింద్రాబాద్ ఆందోళనలో.. ఖానాపూరం యువకుడు మృతి..

వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం దబ్బిర్ పేట గ్రామానికి చెందిన దామెర రాకేష్ ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలో గాయపడి మృతి చెందాడు. రాకేష్ మూడు సార్లు ఉద్యోగానికి ప్రయత్నించగా.. చివరి సారి ఎంపికయ్యాడు. ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పూర్తి చేసుకుని పరీక్ష గురించి వేచి చూస్తున్న సమయంలో పరీక్ష రద్దు అనే సమాచారంతో ఆందోళనకు గురయ్యారు. రాకేష్ కు నలుగురు తోబుట్టువులు కాగా ఒకరు సైన్యంలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement