Thursday, April 25, 2024

No Rules | మైనర్​లకు మద్యం అమ్మకాలు.. రూల్స్ పాటించ‌ని వ్యాపారులు

పర్వతగిరి (ప్ర‌భ న్యూస్‌): వ‌రంగ‌ల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలో ఉన్న మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించ‌డం లేదు. మైనారిటీ తీరని బాలురకు మద్యం విక్రయించడం మండల పరిధిలో చర్చనీయాంశమైంది. వర్ధన్నపేట ఎక్సైజ్ పరిధిలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ వైన్స్.. మైనర్ బాలురకు మద్యం విక్రయించడం, ఇంతకుముందు రాయపర్తి మండలంలోని వైన్స్ వారు మైనార్టీ తీరని బాలురకు మద్యం విక్ర‌యించిన ఘ‌ట‌న‌లున్నాయి.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ కి ప్రజాసంఘాల నాయకులు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయినా వర్ధన్నపేట ఎక్సైజ్ పరిధిలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. దీనిపై ఉన్న‌తాధికారులు సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని గ్రామీణులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement