Friday, April 26, 2024

రోడ్డెక్కిన రైతులు.. ఇసుక లారీలకు బ్రేకులు..

మహాదేవపూర్ (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ శివారులోని కుంట్లం 2వ ఇసుక క్వారీకి మద్దులపల్లి రైతులు భూములు లీజుకు ఇచ్చారు. 2022- 2023 సంవత్సరానికి గాను కౌలు డబ్బులు రైతులకు ఇవ్వకపోవడంతో టిఎస్ ఎండిసి అధికారులకు ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్న స్పందించలేదు. ఆగ్రహించిన రైతులు ఇసుక క్వారీ లోకి లారీలు వెళ్లకుండా నిలిపి రోడ్డుపై ఆందోళన దిగారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించకపోవడంతో ధర్నాకు దిగినట్లు రైతులు తెలిపారు. కౌలు డబ్బులు చెల్లించే వరకు ఒక్క లారీ కూడా కదలనియమని భీష్ముంచుకు కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement