Thursday, April 18, 2024

ఆంధ్ర‌ప్ర‌భ క‌థ‌నానికి స్పంద‌న‌.. నేటి నుంచి ఒంట‌పూట బ‌డులు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో నడుస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వం జారీ చేసిన ఒక్క పూట బడుల నిర్వహణ నిబంధన నియమాలు పాటించడం లేదు. దీంతో ఈ విషయాన్ని నేడు ఒక్క పూట బడి ఉత్తర్వులు ప్రైవేట్ పాఠశాలలకు వర్థించవా అనే శీర్షికన ప్రచురించగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు స్పందిస్తున్నాయి. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ గీతాంజలి డిజి స్కూల్ యాజమాన్యం తమ సంస్థలో చదివే తల్లిదండ్రులకు ఈ రోజు నుండి ఒక్క పూట బడులు నిర్వహిస్తున్నట్లు మధ్యాహ్నం 12:30 గంటలకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాలి అని సంక్షిప్త సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా విద్యాశాఖ ఆదేశాలు సైతం పాటిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement