Friday, March 29, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

స్టేషన్ ఘన్ పూర్ : సబ్ కాంట్రాక్టర్ శివరాత్రి కొమురయ్య నుంచి సీసీ రోడ్డు పనుల బిల్లులో విషయంలో రూ.50 వేలు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవి మొదటగా కొమురయ్య దగ్గర నుంచి రూ.15వేలు తీసుకున్నాడు. ఆ తరువాత మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో కొమురయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి చిరంజీవి డబ్బులు తీసుకుంటుండగా గురువారం రెడ్‌ హ్యండెడ్‌గా వరంగల్ ఏసీబీ నేతృత్వంలో దాడులు చేసి పట్టుకున్నారు. కాగా అతడు గతంలో ములుగు జిల్లా మంగపేట మండలం సుంచిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా. ఇన్ చార్జి ఈవో పీఆర్డిగా పనిచేసాడు. ఆ తరువాత ములుగు మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా చేసిన అనంతరం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి గ్రామ పంచాయతీ ఈవోగా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పంచాయతీ కార్యదర్శి చిరంజీవి

Advertisement

తాజా వార్తలు

Advertisement