Saturday, April 20, 2024

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ. 69 లక్షల నిధులతో పనులు జెడ్పీ పాఠశాలలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 104 పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేసినట్లు,14 కోట్లతో ఎంపిక చేయబడిన పాఠశాలలను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఉన్న బడులను దశల వారీగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లయ్య,జెడ్పీటీసీ పత్తి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement