Thursday, April 18, 2024

జర్నలిస్టులకు అండగా ఎమ్మెల్యే పెద్ది

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని మల్లంపల్లి రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాలలో వార్త సేకరణ కోసం వెళ్తున్న క్రమంలో గాండ్ల ప్రదీప్, బుర్ర వేణు అను జర్నలిస్టులను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన గాండ్ల ప్రదీప్ ను హన్మకొండలో ఉన్న అజార ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రదీప్ ఆర్థిక స్తోమత గురించి తెలుసుకుని వైద్య ఖర్చులు భరిస్తామని, తక్షణ సహాయం కింద లక్ష రూపాయలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న బాధిత కుటుంబానికి అందజేశారు. వైద్యం ఖర్చులు భరిస్తామని, ఉన్నత వైద్యం కావాలన్నా అందజేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ ప‌ర్స‌న్ రజని కిషన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement