Friday, April 26, 2024

మినీ ట్యాంక్ బండ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన తుమ్మల చెరువు మిని ట్యాంక్ బండ్ ను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ దాదాపు 2 కోట్ల 36 లక్షల రూపాయలతో భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజల సౌకర్యార్థం నిర్మించామన్నారు. అహ్లధకరమైన వాతావరణం కోసం తుమ్మల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేశామన్నారు. మరో రూ. 50 లక్షలతో ఓపెన్ జిమ్ తోపాటు మరి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయనున్నామని తెలిపారు.

ఇప్పటికే భూపాలపల్లిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక్క ఏకో పార్క్ ఉందని, సింగరేణి సంస్థ పరిధిలో 2 పార్క్ లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఆహ్లధకరమైన వాతావరణంలో ఈ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ట్యాంక్ బండ్ ట్రాక్ పై సరదాగా బుల్లెట్ బండిని నడిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement